చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.
మండల పరిధిలోని సీతాయిగూడెం వాగు నుంచి గడువు ముగిసిన ఇసుక కూపన్ల ను అడ్డంపెట్టుకుని అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను మంగళవారం రెవిన్యూ సిబ్బంది పట్టుకున్నారు. పట్టుకున్న ట్రాక్టర్ ను రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. ఇసుక కూపన్లను తహశీల్దార్ ఎం ఉష శారద పరిశీలించగా కూపన్ గడువు ముగియడంతో ట్రాక్టర్ యజమానికి ఐదువేల రూపాయలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని. అవసరమైతే ట్రాక్టర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్మాణాల కోసం ఆయా శాఖల అధికారుల నుంచి తప్పనిసరిగా ధ్రువపత్రం తీసుకొస్తే వారికి స్వయంగా ఇసుక కూపన్లు మంజూరు చేస్తామని తెలియజేశారు.
Post A Comment: