చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.
తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడి నేటికి 21 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా చండ్రుగొండ మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోతు బొజ్యా నాయక్ పాల్గొని పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 21 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని. ఆ ఇబ్బందులను గుర్తించిన ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2001లో డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసుకొని. తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీని ఏర్పాటు చేశారని. అప్పటి నుంచి స్వరాష్ట్రం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ.. 29-11-2009 నాడు ఆమరణ నిరాహార దీక్షకు దిగి 11 రోజుల అనంతరం 09-12- 2009 స్వరాష్ట్రాన్ని సాధించుకున్న ఏకైక వ్యక్తిగా కేసిఆర్ చరిత్రలో నిలిచిపోయారని. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని. రాష్ట్రంలో నీటి కొరత లేకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని. రైతులందరికీ ఉచిత కరెంటు రైతు బంధు రైతు బీమా. చిరు వ్యాపారులకు సబ్సిడీపై రుణాలు ఉచిత కరెంటు ఇలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ. టిఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే నెంబర్వన్ రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నదని. ప్రజలు కూడా టిఆర్ఎస్ పార్టీని ఏ ఎన్నికలు వచ్చినా తామున్నామంటూ అఖండ మెజార్టీతో విజయాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నరకుల్లా సత్యనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి చీదెళ్ళ పవన్, మండల ఉపాధ్యక్షులు ఉప్పతల ఏడుకొండలు, గ్రామ శాఖ అధ్యక్షులు నరకుల్లా అప్పాజీ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: