CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ధర్ట్ పార్టీ అధెంటికేషన్ అమలు చేయాలంటూ తహశీల్దార్ కు రేషన్ డీలర్లు వినతిపత్రం.

Share it:

 



చండ్రుగొండ మన్యం టీవీ  ప్రతినిధి.


చండ్రుగొండ  మండల వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో రేషన్ షాపుల్లో ధార్ట్ పార్టీ అధెంటికేషన్ అమలు చేయాలని  మండల వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు మంగళవారం తహశీల్దార్ ఎం ఉష శారద ను కలిసి వినతి పత్రం అందజేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రేషన్ డీలర్లు నిత్యవసర వస్తువులు పంపిణీ ప్రస్తుతం  ఐరిస్ మరియు ఓటీపీ విధానంతో ఇవ్వడం జరుగుతున్నదని  ఒకటే ఐరిష్ మిషన్ వందల మందికి  పెట్టడం వలన ఎవ్వరికీ కరోనా ఉన్నదో లేదో తెలియక మిగతా తెల్ల రేషన్ కార్డు దారులు తో పాటు తమకు సోకే అవకాశం ఉన్నది. అలాగే ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింకు ద్వారా వచ్చే ఓటిపి విధానం వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఎంతోమంది చదువురాని వాళ్ళు ఉండటం వల్ల  వారు సెల్ ఫోన్లకు వచ్చిన ఓటీపీ వారికి తెలియకపోవడంతో  ఆ ఫోను తీసుకొచ్చి మా చేతికి ఇస్తున్నారు. దీని ద్వారా కూడా వ్యాధి సంక్రమించే అవకాశం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది రేషన్ డీలర్లకు కరోనా సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అందులో కొంత మంది మరణించిన వారు కూడా ఉన్నారు. అందువల్ల ఈ విధానాలను రద్దు చేసి గతంలో మంజూరు చేసినట్లుగా..ధార్ట్ పార్టీ అధెంటికేషన్ ఈ విధానాన్ని అమలు చేయాలని తహశీల్దార్ ను కోరినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు బాలాజీ, రాందాస్, హరీష్, రేఖ, కృష్ణ, నరసింహారావు, పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: