చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిది: ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర ఆధ్వర్యంలో చండ్రుగొండ మండలం వంకనెంబర్ గ్రామానికి చెందిన కుంజా నాగేంద్ర బాబు ని ఆదివాసీ సంక్షేమ పరిషత్(asp ) మండల అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షులుగా పూసం కిరణ్ (బెండాలపాడు ) ప్రధాన కార్యదర్శిగా పద్ధం వెంకటేష్ (మద్దుకూరు ) ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ... ఏజెన్సీ మండలాల్లో ఏజెన్సీ చట్టాలను తూట్లు పొడుస్తున్నారని, మా ఆదివాసీలు ఏజెన్సీ చట్టాలు తెలియక ఇంకా వెనుకబడి పోతున్నారని, జీవో నెంబర్- 3 పునరుద్ధరించాలని, 1/70 చట్టాలను పకడ్బందీగా అమలు పరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోలం రామారావు, కిరణ్ కుమార్, కనకరాజు తదితర ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: