మన్యం టీవీ,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,దమ్మపేట మండలం లో ప్రపంచ విప్లవకారుడు కామ్రేడ్ లెనిన్ జయంతిని పురస్కరించుకొని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో గండుగులపల్లీ, ముత్తగూడెం,గొర్రె గుట్ట,లింగాల పల్లి,జమేదార్ బంజరు,గురవాయి గూడెం, కొత్తూరు,పాకల గూడెం, పార్కులు గండి,జగ్గారం, బాలరాజు గూడెం,గురు గుంపు,గురవాయి గూడెం, తాడిమల్ల గుంపు,చందు వారి గూడెం,చల్ల గుంపు గ్రామాలలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.చల్లగుండ్ల గ్రామంలో జరిగిన సభలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కామ్రేడ్ కెచ్చెల రంగారెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో తొలిసారిగా మార్క్సిజాన్ని రష్యా దేశపు బౌద్ధిక పరిస్థితిని అనుగుణంగా అన్వయింప జేసి విప్లవాన్ని విజయవంతంచేసిన కామ్రేడ్ లెనిన్ జయంతి రోజునే 1969 ఏప్రియల్ 22 నసిపిఐ ఎమ్మెల్ ఆవిర్భవించిందని అతివాద మితవాద పెడదోరణుల నుఎదుర్కొంటూ దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పందాలో ముందుకు సాగుతుందని అన్నారు.రైతు వ్యతిరేక ప్రజావ్యతిరేక చట్టాల రద్దుకు పోరాడుతూ ప్రజల సమస్యలపై ప్రజా పోరాట నిర్వహిస్తోందని అన్నారు.ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం స్పూర్తితో పునరంకితం అవుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పాల్వంచ డివిజన్ కార్యదర్శి అమర్లపూడి రాము,పీవోడబ్ల్యూ జిల్లా నాయకురాలు తోడు దుర్గమ్మ, పిడిఎస్యు రాష్ట్ర నాయకురాలు సంధ్య,పీ వై ఎల్ పాల్వంచ డివిజన్ అధ్యక్షులు కాక వెంకటేష్,ఏ ఐ కే ఎం ఎస్ మండల కార్యదర్శి పూకే అప్పారావు,పార్టీ మండల నాయకులు కురసం ముత్యాలరావు.బండి ఆదినారాయణ,కుందా కాంతారావు,కారం ప్రసాద్ ప్రజా సంఘ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: