మన్యం టీవీ,దమ్మపేట : 15-04-2021.
టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత,ఎంపీ నామ నాగేశ్వరరావుని మర్యాద పూర్వకంగా కలసిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావుని గురువారం నాడు ఖమ్మం లోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుని శాలువా కప్పి సన్మానించారు.అలానే ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ గార్ల నాయకత్వంలో పని చేస్తూ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని ఎంపీ నామ నాగేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment: