మన్యం టీవీ, బూర్గంపాడు:
బూర్గంపాడు మండలంలో ఉదయం కురిసిన అకాల వర్షానికి బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ యార్డులో అరబోసిన వరి ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవడంతో బూర్గంపాడు మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో పర్యటించి తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించిన బూర్గంపాడు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు..
అనంతరం వారు మాట్లాడుతూ రైతులు ఎవరు అధైర్య పడొద్దని ప్రభుత్వ అధికారులతో మాట్లాడి తడిసిన ప్రతి గింజని కొనేల చేస్తామని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మనోధైర్యాన్ని ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, బూర్గంపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ,పీఏసిస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి,మండల టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, బూర్గంపాడు పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోనెల నాని,స్థానిక మాజీ ఎంపీటీసీ జక్కం సర్వేశ్వర రావు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాణోత్ శ్రీను,స్థానిక టిఆర్ఎస్ నాయకులు జక్కం సుబ్రమణ్యం,మారం శ్రీనివాస రెడ్డి,గంగాపూరి చంద్రశేఖర్, ఏఈఓ ప్రసాద్ మరియు రైతులు పాల్గొన్నారు.
Post A Comment: