విప్ రేగా కాంతరావు
మన్యం టీవీ, పినపాక:ఆదివాసీల ఆరాధ్యదైవాలు మేడారం సమ్మక్క సారలమ్మ ల దీవెనలతో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగానే కొలుకివాలని విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతరావు ఆదివాసి ఆరాధ్యదైవాలు సమ్మక్క సారలమ్మలు వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన నేపథ్యంలో.. కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, ఆదివాసీల ఆరాధ్యదైవాలు సమ్మక్క సారలమ్మ ల దీవెనలతో ఆయన త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.తెలంగాణ జాతి పిత కేసీఆర్ కోసం యావత్ తెలంగాణ 4కోట్ల ప్రజలు ప్రత్యేక పూజలు చెయ్యడం జరుగుతుంది అని , ప్రజల ఆశీస్సులతో త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది అన్నారు.
Post A Comment: