*ఏటూరునాగారం సిఐ కిరణ్ కుమార్
మన్యం టీవీ ఏటూరునాగారం:
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడి లో భాగంగా శ్రీరామ నవమి ఉత్సాహ కార్యక్రమాలు చేపట్టి వద్దని స్థానిక సీఐ సట్ల కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఏటూరునాగారం, మంగపేట,కన్నాయిగూడెం మండల ప్రజలందరూ శ్రీరామనవమి ఉత్సవాలు జరుపు వద్దు అని, ప్రజలు గుంపులు గా ఒక చోట ఉండవద్దని మూడు మండలంలోని అన్ని గ్రామాల్లో శ్రీరామనవమి ఉత్సవాలను కేవలం ఆలయ పూజారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు గుడి లోపల మాత్రమే పూజా కార్యక్రమాలు జరిపించాలని, ఈ విషయంపై ప్రజలు అందరూ సహకరించాలని కోరారు.కరోనా నియంత్రణలో భాగంగా కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రజలందరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని కరోనా నియంత్రణలో భాగస్వాములు కావాలని సీఐ కోరారు.
Post A Comment: