పినపాక: పినపాక మండలం లోని తోగ్గూడెం గ్రామంలో ఎంపిటిసిల సంఘం అధ్యక్షుడు చింతపంటి సత్యం కరోనా సోకిన కుటుంబాలను శనివారం రోజున పరామర్శించారు. కరోనా సోకిన ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుని, వారికి జాగ్రత్తలు చెప్పడం జరిగింది. కరోనా సోకిన రోగులు తీసుకోవలసిన ఆహార నియమాలు గురించి ప్రత్యేకంగా వివరించడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల నుండి మూడు గంటల వరకు ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ కలవడం జరిగింది .
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్తీ శ్రీలత టిఆర్ఎస్ నాయకులు లక్ష్మయ్య చిట్టి మల్ల సతీష్ చారి, సల్లూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొనడం జరిగింది .
Post A Comment: