కోవిడ్ టీకా పై అపోహలొద్దు
-కుడుముల లక్ష్మీ నారాయణ
తెరాస మండల పార్టీ అధ్యక్షులు.
మన్యం టీవీ మంగపేట.
కరోనా టీకా పై అపోహలోద్దని, 45 సంవత్సరాలు పైబడ్డ అందరూ కోవిడ్ టీకా వేయించుకోవాలి.
45ఏండ్లపైబడ్డ అందరూ కోవిడ్ వాక్సిన్ వేసుకొని కరోనాను తరిమికొట్టాలిఅని తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఈ సందర్బంగా కోరారు.
ఈ రోజు మండలంలోని మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా కుడుముల లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ కరోనా నివారణ దిశగా ప్రజలు చైతన్యవంతం కావాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కు ధరించడంతోపాటు
బౌతిక దూరం పాటించాలి,శానిటైజర్ వినియోగించాలని కోరారు. కరోనాను తరిమి కొట్టాలంటే ప్రజలు అప్రమత్తం కావాలని ఆరోగ్య సూత్రాలు పాటించాలి తప్పనిసరిగా కోవిడ్ వాక్సిన్ వేయించుకోవాలి, అవసరం అయితే తప్ప బయట తిరగకూడదు అని సూచించారు.
Post A Comment: