మన్యం టీవీ,బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని పశువుల ఆస్పత్రిలో డాక్టర్ కోసం ఎదురుచూపులు. ఆస్పత్రి 8:00 గంటలకే తాళాలు తీసినా 10:00గంటల వరకు ఆస్పత్రిలో ఎవరు లేక పోవడం విడ్డురం. 8:00గంటల నుండీ పశువుల చికిత్స కొసం వచ్చినా పశువుల యజమానులు డాక్టర్ కు ఫోన్ చేస్తే ఇదుగో వస్తున్న అదిగో వస్తున్న అంటున్నారు. ఇలా తలుపులు తీసి ఎవరు లేకుంటే హాస్పిటల్లో ఏమైనా పోతే ఎవరు సమాధానం చెపుతారు అంటూ ప్రజల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు...
Post A Comment: