స్థానిక ఎమ్మెల్యే మౌనిక సమస్య పై స్పందించాలి
-టీ యం. యం. ములుగు జిల్లా అధ్యక్షులు. శ్యాంబాబు.
మన్యం టీవీ మంగపేట.
ములుగు జిల్లా కేంద్రం లో నాకు న్యాయం చేయండి అని గత 20 రోజుల నుండి మౌనంగా దీక్ష చేస్తున్నా ప్రజా ప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోక పోవడం చాలా దురదృష్టకరం, ఒక వేళ మీరు సమస్య పై స్పందించి ఉంటే సమస్య ఇంతవరకు వచ్చేదా ఎప్పుడో పరిష్కారం అయ్యేది. ఒక దళిత బిడ్డకు అన్యాయం జరిగింది అని తెలిసికూడా ఆ సమస్యకు పరిష్కారం చూపకపోతే నియోజకవర్గం సమస్యలకు ఎలా పరిష్కారం చూపిస్తారు. ఇన్ని రోజులుగా గూడెపు మౌనిక అనబడే దళిత బిడ్డ సూర్య వర్మ అనబడే వ్యక్తి చేతులో మోసపోతే ఇంత వరకు మీరు స్పందించక పోవడం దళిత, గిరిజనులకు మీరు అన్యాయం చేసినట్లు అవుతుంది అని ఈ సందర్బంగా తెలంగాణా టీ.యం.యం.ములుగు జిల్లా అధ్యక్షులు పేర్కొన్నారు. ఇక నైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యే, ప్రభుత్వం మేల్కొని గూడెపు మౌనిక కు న్యాయం చేయవలసినదిగా కోరారు.
Post A Comment: