CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చందూలాల్ చేసిన సేవలు మరువలేనివి.....

Share it:

 



 సంతాపం తెలిపిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్  డైరెక్టర్ సాంబశివరెడ్డి

మన్యం టీవీ మంగపేట.

గిరిజనుల ముద్దుబిడ్డ, మాజీ రాష్ట్ర మంత్రివర్యులు అజ్మీర చందూలాల్ మరణం తీరనిలోటని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ చందూలాల్ గారి మరణ వార్త తీవ్ర విషాదాన్ని నింపింది అన్నారు.  ములుగు శాసనసభ నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివని, భౌతికంగా ఆయన దూరమైనప్పటికీ ప్రజల గుండెల్లో ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతారని అన్నారు. తనకు ఏటూరునాగారం డివిజన్ ఆత్మ చైర్మన్ గా మూడు సంవత్సరాల పాటు అవకాశం కల్పించారని నాటి స్మృతులను నెమరువేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా చందూలాల్ కుటుంబ సభ్యులకు అభిమానులకు ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: