CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.

Share it:

 


ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన:ఎంపీపీ, పినపాక సొసైటీ చైర్మన్

మన్యం టీవీ కరకగూడెం: పినపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో మండల పరిధిలోని సమత్ భట్టుపల్లి, చిరుమళ్ళ గ్రామలలో శుక్రవారం పినపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మదునూరి రవిశేఖర్ వర్మ కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు అరుకాలం కష్టపడి పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చెస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం లొ టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్న వారు. దేశంలో ఎక్కడ లేని విదంగా రైతును రాజు చెయ్యడమే లక్ష్యంగా రైతు బీమా, రైతు బందు సబ్సిడీ విత్తనాలు ఎరువులు అందిస్తుందన్నారు.అలాగె 24 గంటలు విద్యుత్ సాగునీరు అందిస్తున్నా ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే రూ,,1888 మద్దతు దరతో కొనుగోలు చెస్తుందన్నారు.ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు నేరుగా వారం రోజులలో రైతు ఖాతాలో జమ చెస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చెసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సమత్ భట్టుపల్లి సర్పంచ్ పోలెబోయిన శ్రీవాణి చిరుమళ్ళ సర్పంచ్ పాయం నర్సంహరావు పినపాక సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి  బూర్గంపాడు వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ కొమరం రాంబాబు ఆత్మ కమిటి చైర్మన్ పటేల్ భద్రయ్య రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వట్టం వెంకటెశర్లు మండల అభివృద్ధి అధికారి శ్రీను సొసైటీ డైరెక్టర్లు రావుల కనకయ్య ముద్దం సత్తిష్ రెవిన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు ప్రశాంత్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: