మన్యం టీవీ కరకగూడెం:పినపాక వ్యవసాయ ప్రాథమిక సహకర సంఘం అధ్వర్యంలో కరకగూడెం మండల పరిధిలోని మోతె,తాటిగూడెం గ్రామలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా ప్రారంభించారు. సందర్బంగా అమె మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజలను ప్రభుత్వమే కొనుగోలు చెస్తుందన్నారు.నేటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రైతు బందు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది అన్నారు.అలాగే ధాన్యం అమ్మిన డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో వారంరోజుల వ్యవధిలోనే జమ అవుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొమరం కాంతారావు సొసైటీ డైరెక్టర్ రావుల కనకయ్య గౌడ్ వ్యవసాయ శాఖ అధికారి అనిల్ కరకగూడెం,తాటిగూడెం సర్పంచులు ఊకే రామనాథం, కొమరం విశ్వనాధం టిఆర్ఎస్ పార్టీ నాయకులు రేగా సత్యనారాయణ బుడగం రాము పాల్గొన్నారు
Navigation
Post A Comment: