కళ్యాణలక్ష్మీ చెక్కులను లబ్ధి దారుల ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చిన ఎంపీపీ రేగా కాళికా, రెవిన్యూ అధికారులు
మన్యం టీవీ కరకగూడెం:కరోనా రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో ప్రజాలు ఎవ్వరూ కుడా ఇబ్బందులు పడకూడదు అని ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అదేశాలమేరకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను నేరుగా లబ్ధి దారుల ఇండ్లకు రెవిన్యూ అధికారులతో కలిసి లబ్ధి దారులకు అందించటం జరిగిందని కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా అన్నారు.ఈ సందర్భంగా అమే మాట్లాడుతూ మండలపరిదిలోని వివిధ గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధి దాడులకు గాను పదహారు లక్షల పద్దెనిమిది వందల యాబై అరు రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మీ చెకులను రెవిన్యూ అధికారులతో కలిసి స్వయంగా లబ్ధి దారుల ఇండ్లకు వెళ్లి పంపిని చెయ్యడం జరిగిందన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులలో కూడా సంక్షేమ పధకాలలో ఎటువంటి కోతలు విధించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి అడబిడ్డలకు సీఎం కేసీఆర్ పెద్ద దిక్కుగా నిలుస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో తహశీల్దారు శేషగిరిరావు అర్ ఐ బాబు జడ్పిటిసి కొమరం కాంతారావు కరకగూడెం సర్పంచ్ ఊకే రామనాథం టిఆర్ఎస్ పార్టీ నాయకులు రేగా సత్యనారాయణ బుడగం రాము పినపాక సొసైటీ డైరెక్టర్ రావుల కనకయ్య పాల్గొన్నారు.
Post A Comment: