చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.
మండల పరిధిలో ఉన్న 14 గ్రామ పంచాయతీల్లో పంచాయితీ అధికారులు ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మండలం లో కరోనా వైరస్ ఉదృతంగా వ్యాప్తి చెందుటుడంతో అప్రమత్తమైన అధికారులు. అన్ని గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపో క్లోరైడ్ ద్రవాన్ని గ్రామాల్లో స్ప్రే చేస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడ అపరిశుభ్రత లేకుండా చెత్తను తొలగిస్తున్నారు మురికి నీరు నిల్వ లేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నారు.. అలాగే గ్రామాల్లో గ్రామస్తులు అందరికీ కరోనా పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు మాస్కు తప్పనిసరిగా ధరించాలని శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవాలని అత్యవసరం అయితే తప్ప బయట తిరిగి వద్దని గ్రామాల్లోకి కొత్త వారు ఎవరైనా వస్తే వెంటనే పంచాయతీ కార్యదర్శి కి లేదా గ్రామ రెవిన్యూ అధికారికి తెలియజేయాలని సూచిస్తున్నారు.
Post A Comment: