మన్యం టీవీ,బూర్గంపాడు:
మే-3 వ తేదీన ఐటీసీ పీఎస్ పీడిలో ప్రతిష్టాత్మకంగా జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో శ్రామిక శక్తి ఎంప్లాయిస్ అండ్ బదిలీస్ యూనియన్ - టిఆర్ఎస్కెవి యూనియన్ ఐటీసీ కర్మగారంలో మొట్ట మొదటిసారిగా పోటీ చేస్తుంది. శ్రీరామ నవమి పండగను పురస్కరించుకుని ముత్యాలమ్మ పేటలో గల ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టి, అనంతరం జెండా ఊపి ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభించారు. తర్వాత కార్మికులతో కలిసి ర్యాలీగా ఈస్ట్ గేట్ వద్ద ఎన్నికల కార్యాలయం వరకు రావడం జరిగింది. అక్కడ శ్రామిక శక్తి ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ సానికొమ్ము శంకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత మాట్లాడుతూ.. కార్మికులందరూ ఐక్యంగా ఉంటూ ముందుకెళ్లాలని ఐటీసీలో గులాబీ జెండాను ఎగరవేయాలని కాంక్షించారు.. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాస్, మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, తుపాకుల రవి, హరినాధ్, అంతయ్య, వెంకన్న, మధు మహరాజ్,కందుల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: