మానవత్వం చాటుకున్న ధైర్యశాలి:మణుగూరు మున్సిపాలిటీ కమీషనర్ నాగ ప్రసాద్
కరోనా మహ్మమ్మారి వ్యాధి సోకి మరణించిన వ్యక్తికి దగ్గర ఉండి దహన సంస్కరణలు చేసిన కమీషనర్
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ లోని సుందరయ్య నగర్ గ్రామంలో ఆర్.భద్రయ్య 85 సంవత్సరాలు ఆయన కు కరోనా మహ్మమ్మారి వ్యాధి సోకి అతని ఇంటి దగ్గర బుధవారం మరణించారు. విషయం తెలిసిన వెంటనే మున్సిపాలిటీ కమీషనర్ నాగ ప్రసాద్ చలించిపోయారు.తక్షణమే స్పందించి మృతిని ఇంటికి చేరుకున్నారు.అక్కడకు వారి కుటుంబ సభ్యులు కూడ భయబ్రాంతులకు గురై ఎవరు దగ్గరకు రాకపోవడం తో కమీషనర్ దగ్గర ఉండి కోవిడ్ నిబంధనల ప్రకారం కిట్లు ధరించి వారి సిబ్బంది తో కలిసి భద్రయ్య కు దహన సంస్కరణలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.కమీషనర్ నాగప్రసాద్ కు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.
Post A Comment: