చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి.
చండ్రుగొండ మండల పరిధిలోని గానుగపాడు గ్రామంలో గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాక తాగటానికి నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు గ్రామస్తులు. సోమవారం గ్రామంలోని మహిళలందరూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు మాట్లాడుతూ.. తాగటానికి నీళ్లు లేక కనీస అవసరాలకు కూడా నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని. ఎండాకాలం ఆడవాళ్ళు కూలి పనికి వెళ్లి వచ్చి గ్రామంలో ఉన్న బోర్లు వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూలిపనికి వెళ్లివచ్చి రెక్కలు విరిగేలా బోర్లు కొట్టిన బోర్లలో నీళ్లు రావట్లేదు. ఇప్పటికైనా జిల్లా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోని మా గ్రామంలో మంచినీటి సమస్య లేకుండా చూడాలని మహిళలందరూ వేడుకుంటున్నారు.
Post A Comment: