*చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో అవగాహన రథ యాత్ర.
మన్యం టీవీ ఏటూరు నాగారం:
ఏటూర్ నాగారం మండల కేంద్రంలో బస్ స్టాండ్ సెంటర్ లో ఏటూరు నాగారం సిఐ కిరణ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
అదేవిధంగా కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన వేగంగా వ్యాపిస్తున్న ఈ తరుణంలో ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని తప్పనిసరిగా మాస్క్ ధరించాలని లేనిచో 1000 జరిమాన విధిస్తామని ఆయన అన్నారు. ప్రజలకు అవగాహన కలిపించడానికి చైతన్య యువజన సంఘం చేపట్టిన ఈ రథ యాత్ర మరియు కరపత్రాలు పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని సభ్యులను అభినందిచిన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం సభ్యులు పిట్టల శ్రీను,కత్తెర శ్రీను,తాడూరి దీనబాంధవ స్వామి,గడ్డం వినయ్,పిట్టల శివ, యువజనసంఘం గౌరవ సలహాదారులు జాస్తి శ్రీకాంత్,బానోత్ శ్రీనివాస్ మరియు టిఆర్ యస్ మండల అధ్యక్షులు గడదాసు సునీల్,అధికార ప్రతినిధి పెండ్యాల ప్రభాకర్, టిఆర్ యస్ నాయకులు తాడూరి రఘు,కాత యాదగిరి,భట్టు రమేష్ మరియు యువకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: