మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని అన్నారం గ్రామం లో మంగళవారం అడిషనల్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీతమ్మ సాగర్ బ్యారేజి భునిర్వాసితులకు గ్రామసభ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రైతులు సుమారు 100 సంవత్సరాల నుండి,వారి తాత ముత్తాతల దగ్గరనుండి వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చిన్న సన్నకారు,రెండెకరాల భూమి కలిగిన రైతులం అని,గోదావరి పక్కన ఉన్న నల్లరేగడి నేల,రెండు పంటల కు అనువైన నేల అని,ఇప్పుడు సీతమ్మ సాగర్ లో భూములు కోల్పోతున్నాము కాబట్టి ఎకరానికి 30 లక్షలు ప్యాకేజి ఇవ్వాలని ప్రభుత్వం ద్వారా ఇప్పించగలరని,జాయింట్ కలెక్టర్ కర్నాటి.వెంకటేశ్వర్లు ని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,శేషగిరిరావు, మేడ.నాగేశ్వరావు,జెట్ట.వెంకటేశ్వర్లు,ఉప్పట్ల.బిక్షం,ఆకిన.ధమ్మయ్య,యర్రం.వెంకన్న,కుర్రి. వెంకటేశ్వరరావు,ఆకిన. నరసింహారావు,బండ్ల.ధనకోటి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: