మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గ నిరుద్యోగులకు,విద్యార్థినీ, విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయబోయే వివిధ ప్రభుత్వ శాఖల ఖాళీల భర్తీ ప్రకటనల కు పేద,నిరుద్యోగులను ఆర్థిక ఇబ్బందులు ఉన్న యువతను,హైదరాబాద్ నగరంలో కోచింగ్ సెంటర్లలో చేరి కోచింగ్ తీసుకోలేని పరిస్థితిలు ఉన్న నిరుద్యోగులను పోటీ పరీక్షలకు సిద్ధం చేయాలనీ, వారికి ఆర్థిక చేయూత నందించాలనే లక్ష్యం తో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ కమిటీ మరియు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ఉచిత కోచింగ్ హాస్టల్ ను అనివార్య కారణాల వలన నిర్వహించలేక పోవుచున్నాము అని ట్రస్టు కమిటీ తెలియజేసింది.కనుక ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని మీరు ఇంట్లో ఉండి పోటీ పరీక్షలకు సిద్ధం చేయుటకు బుధవారం 28.04.2021 ఉదయం 9 గంటల నుండి మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఉచిత మెటీరియల్ పంపిణీ చేయుటకు కమిటీ నిర్ణయించడమైనది అని ట్రస్టు కమిటీ తెలిపారు. కనుక కోచింగ్ కొరకు అప్లై చేసుకున్న నిరుద్యోగులు గమనించి సహాకరించగలరని ట్రస్టు కమిటీ కోరారు.
పంపిణీ చేయు మెటీరియల్ వివరాలు
*1.కానిస్టేబుల్ ఉద్యోగాల కొరకు
*2.సబ్ ఇంస్పెక్టర్ ఉద్యోగాల కొరకు
3.గ్రూపు 1,ప్రిలిమినరీ కొరకు మరియు గ్రూప్ 2,3,4 వివిధ పోటీ పరీక్షలకు పంపిణీ చేయుచున్నాము. ఉపాధ్యాయ ఉద్యోగాల మెటీరియల్ కొరకు దరఖాస్తు పెట్టుకున్న నిరుద్యోగులకు వారం తరువాత మెటీరియల్ వస్తుంది కనుక గమనించాలన్నారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ట్రస్టు కమిటీ మరియు విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు కోరారు.
Post A Comment: