మన్యం టీవీ వాజేడు.
వాజేడు/జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా కారణంగా ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నారు.పవన్ కళ్యాణ్ కోలుకోవాలని ఇప్పటికే అభిమానులు పెద్దఎత్తున పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పేరూరు గ్రామంలో పవన్ కళ్యాణ్ వీరాభిమానులు ఆయన తిప్పనపల్లి రాజు సల్పాల జీవన్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పేరుమీద సోమవారం నాడు రామాలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. వకీల్ సాబ్ సినిమా విడుదలై మంచి జోష్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు.. పవన్ కరోనా బారిన పడటం తీవ్ర నిరాశకు గురి చేసింది. మామూలుగానే పవన్ అంటే ప్రాణాలు ఇచ్చే ఆయన అభిమానులు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ను ఐసోలేషన్లో చూసి తట్టుకోలేకపోతున్నారు.ఈ సందర్భంగా తిప్పని పల్లి రాజు మాట్లాడుతూ...ఆపద అంటే మరో ఆలోచన లేకుండా అందుకునే వ్యక్తి, అనునిత్యం పేదోడి కి నేనున్నాను అంటూ అండగా నిలబడి ప్రజల తరుపున ప్రశ్నించే దైర్యం..పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడటంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఈ రోజు రామాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తిప్పపల్లి రాజు,సల్పాల జీవన్, సురేష్, రఘు, సంజన,రవి, పూర్ణచంద్రరావు,ఎర్రావు చంద్రమ్మ,తదితరులు పవన్ కళ్యాణ్ వీరాభిమానులు పాల్గొన్నారు.
Post A Comment: