CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా వాక్సిన్ వేయించుకోవటం పౌరుడిగా మన బాధ్యత-కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగెర్ల. రాజారత్నం.

Share it:

 


మన్యం టీవీ మంగపేట.


మంగపేట మండలం వ్యాప్తంగా నిర్వహిస్తున్న వాక్సినేషన్ లో భాగంగా ఈ రోజు కన్నాయిగూడెంలో కరోనా వాక్సిన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగెర్ల రాజరత్నం కరోనా టీకా వేయించుకున్నారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ మన మానవాళి మనుగడ కు ముప్పు లా పరిణమించిన కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే స్వీయ నియమ నిబంధనలు పాటించండి మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలి. ప్రతి ఒక్క పౌరుడు ప్రభుత్వం ఆదేశానుసారం కరోనా టీకాలు వేయించుకొని ఆదర్శ పౌరులుగా అందరికి మార్గదర్శంకావాలని ఈ సందర్బంగా సూచించారు. యవత వీలైతే తప్ప బయటకు రాకూడదు, స్కూల్లు, కాలేజలు లేకపోవడంతో యువకులు రోడ్ల మీద, వాలీబాల్, క్రికెట్ లాంటి సామూహిక ఆటలు ఆటలు ఆడుతూ కనపడుతున్నారని  అటువంటి అన్ని కార్యక్రమాలు వాయిదా వేసి ఇంట్లో ఉండటం మేలని ఈ సందర్బంగా గుర్తు చేసారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి వాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని, ఇంటి ఇంటికి వాక్సిన్ పంపించి వేయించాలి అని ప్రభుత్వాన్ని కోరారు.ప్రజలు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని స్వచ్చందంగా వచ్చి కరోనా టీకాలు తీసుకోవాలి అని సూచించారు.

Share it:

TELANGANA

Post A Comment: