మన్యం టీవీ దుమ్ముగూడెం:
దుమ్ముగూడెం మండలం లో గవర్నమెంట్ హాస్పటల్ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాన్ని గత రెండు నెలల నుంచి శ్రమించి అద్భుతమైన క్రీడామైదానం గా తీర్చిదిద్దిన ఘనత దుమ్ముగూడెం పోలీసువారికి దక్కింది. ప్రత్యేకంగా గిరిజన యువతకు అన్ని రకాల క్రీడల కొరకు మరియు వారి శారీరక పెరుగుదలకు, భవిష్యత్తులో పోలీస్ శాఖ సంబంధించిన ఉద్యోగాలు పొందుటకు ఉపయోగపడుతుందని సీఐ వెంకటేశ్వర్లు దీనిని తీర్చిదిద్దడం జరిగింది. ఈ క్రీడా మైదానం ప్రారంభ కార్యక్రమంలో తాసిల్దార్ రవికుమార్ ఎంపీడీవో ముత్యాలరావు, డాక్టర్ బాలాజీ, ఎస్ఐ తిరుపతి, రవికుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు.
Post A Comment: