👉 అత్యవసర మెడికల్ ఆక్షిజన్ కిట్లు కొరత లేకుండ చూడాలి
మన్యం టీవీ.ములకలపల్లి మండలం : ఈరోజు ములకలపల్లి మండలం మంగపేట గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో ములకలపల్లి జెడ్పిటిసి సున్నం నాగమణి దంపతులు కోవిడ్ వ్యాక్షిన్ వేయించుకున్నారు. గ్రామాల్లోని ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్షిన్ వేయించుకోవాలి కోరుకున్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు , మరియు సహాయక సిబ్బంది ఎప్పుడు అందరూ అందుబాటులో ఉంటూ గ్రామీణ ప్రాంత ప్రజలకు వ్యాక్సిన్ పై ఉండే అపోహలను నమ్మకుండా . మండలం లోని ప్రజలందరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకునేటట్లు ప్రోత్సయించాలి. వ్యాక్సిన్లు మరియు అత్యవసర మెడికల్ ఆక్షిజన్ కిట్లు కొరత లేకుండ చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలాను ఈ సందర్భంగా డిమాండు చేసారు. ప్రతి ఒక్కరు తప్పకుండ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని మండల ప్రజలకు విజ్ఞ్యాప్తి చేశారు.
Post A Comment: