మన్యం టీవీ గుండాల: కరోనా కోరల్లో గిరిజన పల్లెలు విలవిలలాడుతున్నాయి గత కొన్ని రోజులుగా మండలంలోని గ్రామాల్లో పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి ప్రతిరోజు ప్రాథమిక వైద్యులు డాక్టర్ రవి చంద్ హెల్త్ క్యాంపులు నిర్వహించి కరోనా పరీక్షలు నిర్వహించగా భారీ సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో 130 మందికి కరోనా పరీక్షలు చేయగా 37 కేసులు నమోదయ్యాయి ముక్తాపురం పంచాయతీ పరిధిలోని మోదుగుల గూడెం గ్రామంలో 50 పరీక్షలు చేయగా 30 మందికి కరోనా నిర్ధారణ అయింది రోజులు గడుస్తున్న కొద్దీ మండలంలో కేసులు పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ప్రాథమిక వైద్యులు రవి చంద్ మాట్లాడుతూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మాస్కులు తప్పకుండా ధరించాలని అన్నారు
Post A Comment: