మన్యంటీవీ, అశ్వారావుపేట: మండలం లో కరోనా కేసులు పెరుగుతుందడంతో మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ లో సర్పంచ్ నారం రాజశేఖర్ ఆధ్వర్యంలో బ్లీచింగ్ చల్లించడం జరిగింది. అనంతరం ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ తప్పని సరిగా ధరించాలని, బయటకి వెళ్ళాలి అంటే అత్యవసర పరిస్థితులలో తప్ప అది కూడా మాస్క్ ధరించి, సోషల్ డిస్టన్స్ పాటిస్తూ వెళ్లాలని ప్రజలకు అవగాహనా చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గంగుల రవి, ఉప సర్పంచ్ తోడం బుచ్చప్ప, వార్డ్ సభ్యులు బేతి రాంబాబు, మడకం లక్ష్మి, కారం వీరభద్రమ్మ, వెంకటమ్మ, పుల్లమ్మ, సుగుణ, నాగేశ్వరావు, గుమస్తా మంగరాజు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: