మన్యంటీవీ,అశ్వరావుపేట:
పారిశుద్ధ్యాన్ని అధిక ప్రాధాన్యత ఇస్తూ, గ్రామపంచాయతీ నందు, బ్లీచింగ్ చలించడం జరిగిందని, సర్పంచ్ అట్టం రమ్య తెలిపారు. అశ్వరావుపేట మండలంలోని, మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామపంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. రోజు రోజు కరోనా కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పారిశుద్ధ్యం పై అధిక ప్రాధాన్యత ఇస్తూ, అత్యవసర సమయంలో మాస్కులు ధరించి ఇంటినుండి బయటికి రావాలని, మాస్కూలు ధరించకుండా ఇంటి నుండి బయటకు వస్తే నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. రానున్న కాలంలో ఒక ప్రణాళిక బద్ధంగా గ్రామపంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళతామని అన్నారు. సకాలంలో గ్రామపంచాయతీ పన్నులు చెల్లించే అభివృద్ధి బాసటగా నిలవాలని కోరారు. మాస్ కె మానవుని ప్రాణానికి రక్షణ అని మాస్క్ లేకుండా తిరిగితే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు యువకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: