మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలంలో అఖిల భారత రైతు కూలీ సంఘం సమావేశం నిర్వహించారు. మండలంలోని కొండాయిగూడెం గ్రామంలో కారం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన, ఈ సమావేశంలో జిల్లా నాయకులు ఎస్కే ఉమర్ పాల్గొని మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా రైతులు ఇబ్బందుల్లో ఉంటే, మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా పాలక ప్రభుత్వాలు, రైతులపై విత్తనాల భారం మోపుతున్నాయాని, వేసవి సీజన్ ప్రారంభం కాగానే విత్తనాల కంపెనీలు ధరలు పెంచడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారని, ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, పెంచిన విత్తనాల ధరలను ప్రభుత్వాలు తగ్గించాలని,అఖిల భారత రైతుకూలి సంఘం డిమాండ్ చేస్తుందని అన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వాలపై అఖిల భారత రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో రైతులు పోరాటం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఏఐకేఎంఎస్ సమావేశంలో కొర్సా వీదప్ప , కుంజా సీతారాములు , కే జంపాలు , తిరుపతయ్య తదితర గిరిజన రైతులు పాల్గొన్నారు.
Post A Comment: