మన్యం మనుగడ, పినపాక:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేద ఆడపిల్లల వివాహానికి సంబంధించి అందించే కల్యాణలక్ష్మి చెక్కులను మంగళవారం రోజున సింగిరెడ్డి పల్లి సర్పంచ్ లక్ష్మి రూపవతి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో సింగిరెడ్డి పల్లి పంచాయితీ లోని అర్హులైన ఆడపిల్లల తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మి రూపవతీ మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మి పథకం నిరుపేద ఆడపిల్లలకు వరం లాంటిది అని, కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి పల్లి పంచాయతీ ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఆర్ ఐ వీరభద్రం, పంచాయతీ సెక్రటరీ బట్టా. శ్రీహరి టిఆర్ఎస్ నాయకులు రామయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: