మన్యం టీవీ : జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ నేటికి 20 ఏళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2001 ఏప్రిల్ 27న మొదలైన టిఆర్ఎస్ పార్టీ నేడు 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈమేరకు జూలూరుపాడు లోని వైరా నియోజకవర్గ శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్ క్యాంపు కార్యాలయంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించి.. స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీ చెరగని ముద్ర వేసిందని.. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో పార్టీ ఆవిర్భవించి అహింసా మార్గంలో స్వరాష్ట్రాన్ని సాధించటం అనేది ఆధునిక భారత రాజకీయాలకు మేలి మలుపు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లావుడ్యా సోని, సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, ఎంపిటిసి దుద్దుకూరు మధుసూదనరావు, ఎఎంసి డైరెక్టర్లు హలావత్ నరసింహారావు, సపావట్ నరేష్, ఉద్యమ నేత వేల్పుల నర్సింహారావు, సర్పంచ్ కిషన్ లాల్, పార్టీ నాయకులు రామిశెట్టి నాగేశ్వరరావు, బానోతు ధర్మా. బోడా బాబులాల్, కంభంపాటి వెంకటనారాయణ, రామిశెట్టి నరేందర్,రావుట్ల నరేష్, తాళ్లూరి అఖిల్, దారావత్ నరేందర్, గోపిశెట్టి సాయి, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Navigation
Post A Comment: