CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం: ముఖ్య అతిథిగా పాల్గొన్న రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో గురువారం 1995-96 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు పటేల్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ విద్యార్థుల పట్ల,ఉపాధ్యాయులు పట్ల తనకు ఉన్న అభిమానాన్ని, వారి కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. ప్రస్తుత సమాజం పట్ల ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి ఉండాలి అని,ఎమ్మెల్యే రేగా కాంతారావు తన  అనుభవాలను వారితో పంచుకున్నారు.అనంతరం విద్యార్థులు విప్ రేగా కాంతారావు ను సన్మానించారు. స్కూలు అవసరాల నిమిత్తం కంప్యూటర్,ప్రింటర్,బీరువా, కుర్చీలు,ఇతర స్కూలుకు అవసరమైనటువంటి వస్తువులను విప్ రేగా కాంతారావు చేతుల మీదుగా స్కూల్ యాజమాన్యానికి అందజేశారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు మరియు పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొని వారు అనుభవాలను పంచుకున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: