మన్యం టీవీ: కరకగూడెం.మండల పరిదిలోని చొప్పాల గ్రామపంచాయతి లో
గత సంవత్సరం జులై 7 వ తేదిన చొప్పాల గ్రామపంచాయతీ 6 వ వార్డు సభ్యురాలు ఎట్టి స్వరూప(బండారిగుంపు)అనారోగ్యంతో మరణించడంతో వార్డు ఆకస్మిక ఖాళీని భర్తీ చేయు నిమిత్తం తెలంగాణా ఎలక్షన్ కమీషన్ వారి ఆదేశాలను అనుసరించి తయారు చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా మరియు పోలింగ్ కేంద్రం ఎంపిక పై అభ్యంతరములు తెలుపుటకు గాను బుధవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయం లో యం.పి.డి.ఓ శ్రీనువాసు ఆద్వర్యంలో మండలంలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేగా కాళిక ,యం.పి.ఓ.సునిల్ కుమార్ మరియు వివిధ రాజకీయ పార్టీల మండల అధ్యక్షులు,రావుల సోమయ్య,సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్,వంగరి సతీష్,సత్రపల్లి సాంబశివరావు,సిరిసెట్టి కమలాకర్,రామగాని సందీప్ గౌడ్ లు పాల్గొన్నారు.
Post A Comment: