వ్యాక్సినేషన్ పై అపోహలు,భయాలు విడనాడి మరింతగా అవగాహన కలిగి ఉండాలి:మాజీ ఎమ్మెల్యే పాయం.వెంకటేశ్వర్లు
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ని శివ లింగాపురం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో సోమవారం పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం. వెంకటేశ్వర్లు మెదటి డోస్ వ్యాక్సినేషన్ వేసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ రోజు రోజు కి అత్యంత వేగంగా విజృంబిస్తూ,డేంజర్ బెల్స్
మోగిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ ను వేసుకొని కోవిడ్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచించిన కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే అర్హత గల ప్రతిఒక్కరూ ముందస్తుగా వ్యాక్సినేషన్ వేసుకొని కరోనా బారినపడకుండా ఉండాలని సూచించారు.వ్యాక్సినేషన్ ప్రాణాంతకం కాదని అటువంటి అపోహలు విడనాడి డాక్టర్ అందించే సలహాలు,సూచనలు పాటించాలని కోరారు. అపోహలు,భయాలు విడనాడి వ్యాక్సినేషన్ వేసుకునే విదంగా ప్రజల్లో మరింత అవగాహన పెంచే విదంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం.వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.
Post A Comment: