మన్యం టీవీ మణుగూరు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శేషగిరి నగర్ గ్రామం లో తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు అధ్యక్షత న సిఎం రిలీఫ్ ఫండ్ నుండి 6 మంది లబ్ధిదారులకు వచ్చిన రూ.2,50,000 రూపాయల చెక్కులను వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఆందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో పీఏసీఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి. నవీన్,మీడియా ఇంచార్జ్ యాదగిరి గౌడ్,శేషగిరి నగర్ టౌన్ అధ్యక్షులు వేముల.లక్ష్మయ్య, సొసైటీ డైరెక్టర్ ఉడతాని రవి,కో అప్షన్ సభ్యులు జావిద్ పాషా, ఉప సర్పంచ్ ప్రభుదాస్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకట్ రెడ్డి,హరిప్రసాద్, బాబుజాన్,తాత రమణ, బూర్గుల.సంజీవ్ రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: