మన్యం టీవీ చర్ల
చర్ల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 195 వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకుడు కొండా.చరణ్ మాట్లాడుతూ ఈ సమాజంలో ప్రతిఒక్కరు సమాన హక్కులతో జీవించాలని తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప సంఘసంస్కర్త జ్యోతిరావు గారని అన్నారు.
మనువాదా కబంధ హస్తాల్లో నలిగిపోతున్న స్ర్తి జాతికి చైతన్య జ్వాలని రగిలించిన, స్త్రీల కు చదువు అవసరాన్ని చెప్పి విద్యాబోధన చేసిన మహోపాధ్యాయుడు అని కొనియాడారు.
అంటరానితనం, కుల వివక్షత రూపుమాపడంకోసం ఎన్నో ఉద్యమాలు చేసినారని, సతిసాగమనము నిర్ములించాలని, మూఢవిస్వాసాలు సమాజ తిరోగనమేనని ప్రజలకు బోధించిన తత్వవేత్త అని అన్నారు.
సమాజంలోని రుగ్మతలను రూపుమాపాలని, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువా, అనే తరథమ్యాలు ఉండకూడదని కోరుకున్నారు.
నేటి సమాజ పోకడకు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని అందరూ ఆయన అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు అలవాల.రాజమ్మ,మచ్ఛా. రామారావు, ఐనవోలు శ్రీను, శంకర్,ముత్తయ్య,రాజు,చంటి,సాయి కుమార్ , వీరేంద్ర ,రాఘవయ్య,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: