బాధిత రాలుని పరామర్శించిన తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు అల్లెం కోటి
మన్యం టివి కరకగూడెం.మండలపరిదిలోని కొత్తగూడెం గ్రామంలో ఆదివారం విద్యుత్ షాట్ సర్క్యూట్ తో గడ్డి ఇల్లు దగ్ధం అవ్వడంతో విషయం తెలుసుకున్న తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు అలెం కోటి బాధిత రాలుని పరామర్శించి 1000 రూ,,ఆర్థిక సహాయం అందజేసినారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరుపున తక్షణ ఆర్ధిక సాయం అందించి,డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చెయ్యాలని కోరారు. అలాగే కలిపోయిన పట్టా పాస్ పుస్తకాలు కొత్తవి మంజూరు చెయ్యలన్నారు.అలాగె స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే ఆర్ధికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సుతారి నాగేశ్వరరావు కొమరం రాంగోపాల్ సిద్దబోయిన శ్రీ కాంత్ ఊకే.గణేష్ కొమరం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: