మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలంలోని టిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయం నందు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడం నరసింహారావు ఆధ్వర్యంలో బుధవారం డా. బాబా సాహెబ్ అంబెడ్కర్ 130వ, జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో కుల వివక్షత లేకుండా, బడుగు బలహీన, వర్గాల కోసం జీవితకాలం పోరాడిన మహనీయుడు అన్నారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో సామాజిక, రాజకీయ, హక్కులకోసం పోరాడిన ఉద్యమకారుడు అంబేడ్కర్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత, ఆర్థిక వేత్త, న్యాయకోవిదుడు, రాజనీతిజ్ఞుడు, రాజకీయ నేత, సంఘ సంస్కర్త, భారతరత్న, డా. బాబా సాహెబ్ అంబేడ్కర్ అని కొనియాడారు. ఇలాంటి మహనీయుల జీవిత చరిత్రను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ లేళ్ళ వెంకట్ రెడ్డి, స్థానిక ఎంపీపీ లావుడ్యా సోనీ, టిఆర్ఎస్ ఉపాధ్యక్షులు నాగరాజు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు యదళ్ళపల్లి వీరభద్రం, మాడుగుల నాగరాజు, మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.
Post A Comment: