మన్యం టీవీ, అశ్వాపురం: ఈరోజు అశ్వాపురం గ్రామ పంచాయతీలో రోజు రోజుకి కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, లేనిపక్షంలో 1000 వెయ్యి రూపాయలు జరిమానా విధించబడును. ప్రతి ఒక్కరూ శానిటేషన్ తో చేతులు కడుక్కోవాలి అని,సమదూరం పాటించాలని,45 సంవత్సరాలు నిండిన వారు వ్యాక్సిన్ తీసుకోవాలని, గుంపులు గుంపులుగా కూడా రాదని,తెలియజేస్తూ ఈరోజు అశ్వాపురం గ్రామ పంచాయతీలో సర్పంచ్ భానోత్ శారద,ఉప సర్పంచ్ భూక్య చందూలాల్ విజ్ఞప్తి చేస్తూ ఆటోకు మైకు పెట్టి ప్రచార రథాన్ని ప్రారంభించినారు. మండలానికి వచ్చే ప్రజలు కరోనా మహమ్మారి పారాత్రోలుటకూ కృషి చేయాలని తెలియజేసినారు.
Post A Comment: