మన్యం టివి:నూగూరు వెంకటాపురం
వెంకటాపురం మండల కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో టియస్-ఏటియఫ్ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి బొగ్గుల లక్ష్మయ్య అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టియస్-ఏటియఫ్ సంఘంలో సభ్యులుగా ఉన్న మహిళా ఉపాధ్యాయులను శాలువా కప్పి సన్మానించారు.
ఈకార్యక్రమంలో టియస్-ఏటియఫ్ రాష్ట్ర నాయకులు కోరం సంతోష్ కుమార్ మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో ఎదగాలని, స్వయం ఉపాధి తో ముందుకు సాగాలని అవరోధాలు అధిగమించి భావి తరాలకు స్పూర్తి ప్రధాతలు కావాలని, మహిళలపై జరుగుతున్న సాంఘీక విద్రోహ శక్తులకు భయపడకుండ మనోస్ర్థైర్యంతో ఎదగాలని వారు మాట్లాడారు.
అదే విధంగా మరో టియస్-ఏటియఫ్ రాష్ట్ర నాయకులు జె.నాగేశ్వర రావు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని వారు కోరారు.
అలాగే ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి బొగ్గుల లక్ష్మయ్య మాట్లాడుతూ ఆదివాసి మహిళాలపై వేదింపులను అందరూ కలిసి కట్టుగా ఎదిరించాలని మహిళలకు కల్పించిన చట్టాలు పకడ్బందిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమం అనంతరం టియస్-ఏటియఫ్ వెంకటాపురం నూతన కమిటీ ని ఎన్నుకున్నారు.
మండలాధ్యక్షులు గా పూనెం రమేష్,మండల ఉపాధ్యక్షులుగా కె ఇందిరా దేవి ,మండల ప్రధాన కార్యదర్శి గా అట్టం దామోదర్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కార్యదర్శులు కె నాగరాజు,పర్శిక రమేష్,యస్ ఆంజనేయులు మండల కార్యవర్గ సభ్యులు యన్ నాగమణి,బి శిల్ప,టి విజయలక్ష్మి,జె సుజాత,జె పుష్పలత, శాంతకుమారి,భాగ్యలక్ష్మి, విజయలక్ష్మి, సరిత ,శ్రీదేవి,ప్రమీల,రాజ్యలక్ష్మి, శిరీష, రమాదేవి,యశోద తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: