జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి
మన్యం టీవీ మంగపేట.
వెంకటాపురం (ములుగు) మండల కేంద్రానికి చెందిన రామప్ప రైతు సేవా సహకార సంఘం అధ్యక్షుడు నరెడ్ల వేణు మాతృమూర్తి నరెడ్ల వినోద ఇటీవల అనారోగ్యంతో మరణించగా సోమవారం జరిగిన దశదిన కర్మ కు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివ రెడ్డి హాజరయ్యారు. వినోద చిత్రపటానికి పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మౌనం పాటించారు. ఈ సందర్భంగా కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మల్కా రమేష్ భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు లేగల శ్రీనివాస్, వికాస్ అగ్రి ఫౌండేషన్ డైరెక్టర్ నేలపట్ల శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: