CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాలమూరు జిల్లా నేతలతో వైఎస్ షర్మిల బేటీ

Share it:

 


 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నేతలు, వైఎస్ అభిమానులతో ఆయన తనయురాలు వైఎస్ షర్మిల మంగళవారం సమావేశమయ్యారు. లోటస్‌పాండ్‌లోని తన నివాసంలో సమావేశమైన ఆమె మాట్లాడుతూ.. కోహినూర్ వజ్రం పుట్టిన జిల్లా పాలమూరు అన్నారు. కానీ నేడు వలసల జిల్లాగా మారిందని వాపోయారు. గల్ఫ్‌లో 150 మంది గల్లంతు అయ్యారన్న వార్త విన్నప్పుడు తన గుండె తరుక్కు పోయిందన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆరోగ్యశ్రీ కింద 2లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని గుర్తు చేశారు. ప్రాజెక్ట్‌లలో 80 శాతం తన తండ్రి రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే పూర్తి చేశారన్నారు. భీమ, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల సాగర్ ఇంకా ఎందుకు పూర్తి చేయలేక పోయారని ప్రశ్నించారు.

Share it:

TELANGANA

Post A Comment: