మన్యం టీవీ పినపాక: ఎమ్మెల్సీ ఎన్నికల తరుణం వస్తున్న సమయంలో మండలంలోని రాజకీయ ప్రతినిధులు ఎన్నికల ప్రచారంలో హడావిడిగా ఉన్నారు.నల్లగొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం పినపాక మండలం ఉప్పాక సర్పంచ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ పూనేం సుజాత, ఉపసర్పంచ్ రామారావు పంచాయితీలోని పట్టభద్రులను కలుసుకొని టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కి తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారు పట్టభద్రులను కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో ఉప్పాక పంచాయతీ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శ్యామల సతీష్, తాటి సంపత్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: