ఎమ్మెల్సీ ఎన్నికల సన్నహక సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీటీసీ పొశం నర్సింహారావు, ఎంపీపీ కారం విజయకుమారి
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు మండల ప్రజా ప్రతినిధుల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కై కృషి చేయాలని,అనుసరించవల్సిన విధి విధానాలు అంశాలపై చర్చించారు.ఈ కార్యక్రమంలో మణుగూరు జడ్పీటీసీ పోశం. నరసింహారావు,ఎంపీపీ కారం.విజయ కుమారి, పీఏసీఎస్ చైర్మన్ కుర్రీ నాగేశ్వరరావు,ఎంపీటీసీ ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి కోటేశ్వరరావు,పట్టణ అధ్యక్షుడు అడపా అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, సర్పంచుల సంఘం అధ్యక్షులు ఏనిక ప్రసాద్, సమితి సింగారం ఉప సర్పంచ్ పుచ్చకాయల శంకర్,మండల ప్రజా ప్రతినిధులు,సర్పంచులు, ఎంపీటీసీలు,వార్డు మెంబర్లు,గ్రామ కమిటీ అధ్యక్షులు,సొసైటీ డైరెక్టర్లు, ఉప సర్పంచులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Post A Comment: