మన్యం టీవీ,దమ్మపేట: మహిళల జీవితాలను ఛిద్రం చేసే వ్యవసాయరంగ కార్పొరేటీకరుణకు వ్యతిరేకంగా దమ్మపేట లో అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం పీవోడబ్ల్యూ ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ యార్డ్ లో సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రగతిశీల మహిళా సంఘం పీవోడబ్ల్యూ జిల్లా నాయకురాలు దుర్గమ్మ మాట్లాడుతూ మన దేశంలోని అత్యధిక మహిళలు వ్యవసాయ రంగంలోనే ఉపాధి పొందుతున్నారని అన్నారు. వ్యవసాయ పనులు అయినా నాట్లు కలుపు కోత పాత అన్నింటా మహిళలే ఎక్కువగా పని చేస్తున్నారని అన్నారు. దేశంలో ఆహార భద్రతను సార్వభౌమాధికారాన్ని జాతీయ భద్రతా చట్టాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసే ఈ వ్యవసాయ చట్టాలు రైతుల చేతుల్లో ఉన్న భూమిని కార్పొరేట్ కు కేంద్ర ప్రభుత్వ అప్పగిస్తుంది అన్నారు.
అనంతరం ప్రదర్శన కార్యక్రమం మార్కెట్ యార్డ్ నుంచి పాత బస్టాండ్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడిఎస్యు రాష్ట్ర నాయకురాలు, పిఓ డబ్ల్యు నాయకులు లక్ష్మి, శ్యామల, బంగారమ్మ, సూరమ్మ, చిట్టమ్మ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: