మన్యం టీవీ,అశ్వాపురం: ఈరోజు మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్ అధ్యక్షతన, ఎంపీపీ ముత్తినేని సుజాత ముఖ్యఅతిథిగా పాల్గొని నిర్వహించిన సమావేశంలో ఫారెస్ట్ అధికారులు అనుసరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పక్క తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జిఓ లు రెడీ చేసి గిరిజనులను ఇబ్బంది పెట్టొద్దు అని చెబుతున్నా వినకుండా అధికారులు గిరిజనులపై జులుం ప్రదర్శించటం సరికాదని ఇలాంటి చర్యలు తక్షణమే మానుకోకపోతే ప్రజాగ్రహానికి గురవుతారని తెలియజేశారు. అందువలన దయచేసి ఫారెస్ట్ అధికారులు ఇలాంటి చర్యలు నిలిపివేయాలని హెచ్చరించారు.
ఈ సమావేశంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో
మండలంలో డి ఎం ఎఫ్ సి గ్రాంటు ద్వారా
1.అశ్వాపురం నుండి (వయా గొందిగూడెం) మొండికుంట వరకు 37 కోట్లతో 6 కిలోమీటర్ల మేర బి టిరోడ్
2. రామచంద్రపురం వాటర్ ట్యాంక్ నుండి ఓడ్డుగూడెం కొత్తూరు 2 కోట్ల 80 లక్షలతో బీటీ రోడ్డు
3. గొల్లగూడెం నుండి ఎస్పి బంజర్ 1.40 లక్షలతో బీటీ రోడ్డు
4. అశ్వాపురం నుండి గొందిగూడెం 78 లక్షలతో 1.5 కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు జరిగినవి తెలియజేశారు.
ఈ సందర్భంగా సుమారు 41. కోట్ల 98 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం జిల్లా మండల కోఆప్షన్ మెంబర్లు ఎండి షరీఫుద్దీన్, ఎస్.కె ఖదీర్, సర్పంచులు కాకా అశోక్, కలేటి నరసింహారావు, పర్షిక సూరిబాబు, తుమ్మలచెరువు ఎంపిటిసి తాటి పూజిత, మండల యువజన నాయకులు వల్లబోజు మురళి కృష్ణ, తాటి వెంకటేశ్వర్లు, మందా హుస్సేన్ ,కడారి వేణు, వల్లపు కృష్ణ , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: