పినపాక ఎంపీడీవో శ్రీనివాసులు హెచ్చరిక
మన్యం టీవి పినపాక: ఏడూళ్ల బయ్యారం ఎక్స్ రోడ్ లో, రహదారి పరిధిలో ఆర్ అండ్ బి కొలతలు నిర్ణయించిన ప్రకారం హోర్డింగ్ లను, ఫ్లెక్సీలను తొలగించాలని ఎంపీడీవో శ్రీనివాసులు అన్నారు. ఎక్స్ రోడ్ లో గల వ్యాపారస్తులతో శుక్రవారం సమావేశాన్ని ఏర్పాటు చేసి, తగు సూచనలు ఇచ్చారు. గతంలో పంచాయతీ ద్వారా రెండు సార్లు నోటీసులు పంపించామని, ఇదే ఆఖరి సారి అని, అధిగమించిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రయాణికులకు, వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడం తో ఆర్ అండ్ బి కొలతల ప్రకారం నిర్మాణాలను చేపట్టాలని, తెలియజేశారు.
Post A Comment: